ఖమ్మం ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జి
పువ్వాడ నాగేంద్ర కుమార్)
తెలంగాణలో ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఖమ్మం నగరం లోని
డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
సుజాల సాయి శ్రీ – 438
మాన్వి భూదాత – 437
ఎన్. స్వాతి – 437
ఎం. దీప్తి – 436
కే. సాత్విక – 433
కే. అశ్విత – 433
బి. కీర్తి స్నేహ – 432
పి. విద్యాభారతి – 432
ఈ. పూజ – 431
బి. జెస్విత – 431
సి.హెచ్. సింధుజ – 430
ఇవే కాకుండా, 400కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 50 మంది ఉన్నట్లు అకాడమీ sibbaతెలిపింది.
నీట్ కోచింగ్తో పాటు ఇంటర్ సిలబస్ను తక్కువ కాలంలోనే సమర్థవంతంగా బోధించి అద్భుత ఫలితాలు సాధించడం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రత్యేకతగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నీట్ పరీక్షలో 3వ ర్యాంక్ సాధించిన టి. వెన్నెల తమ విద్యార్థినేనని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రతి సంవత్సరం 100కి పైగా ఉచిత ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న ఏకైక విద్యాసంస్థగా అకాడమీ గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అకాడమీ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. అకాడమీ యాజమాన్యం ఈగ భరణి కుమార్, ఈగ లక్ష్మి, రాయల సతీష్ కుమార్, ఈశ్వరీలు ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు.


