శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతిఫలం తప్పకుండా మంచి ఫలితాల రూపంలో దక్కుతుందని అన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పాలని కోరారు. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు ఈ పరీక్షలు ఒక ముఖ్యమైన మెట్టని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి విజయపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతిఫలం తప్పకుండా మంచి ఫలితాల రూపంలో దక్కుతుందని అన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పాలని కోరారు. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు ఈ పరీక్షలు ఒక ముఖ్యమైన మెట్టని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి విజయపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

