Thursday, 12 February 2026
  • Home  
  • ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహణ*
- జనగాం

ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహణ*

జై వాసవి జై జై వాసవి జై ఆర్యవైశ్య జై జై ఆర్యవైశ్య స్టేషన్గన్పూర్ (పున్నమి ప్రతినిధి) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఈరోజు (26-10-2025, ఆదివారం) జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ — నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, మా మహాసభ పునఃజీవితమై జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశేష కార్యకలాపాలు చేపట్టడం గర్వకారణ అని తెలిపారు. *గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 సభ్యత్వాలను 2500 సభ్యత్వాలుగా పెంచడమే కాకుండా, వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం,* *బతుకమ్మ పండుగను జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో 200 మందితో ఘనంగా నిర్వహించడం*, *మరియు జిల్లా వ్యాప్తంగా 60 మంది ఉత్తమ ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు.* అదేవిధంగా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన OC JAC సమావేశంలో జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఐక్యతను ప్రతిబింబించే విధంగా పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను వివరించారు — *రాబోయే రోజుల్లో పేద ఆర్యవైశ్య బంధువులకు పుస్తెమట్టలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం*. *ఈ కార్తీకమాసంలో జిల్లా స్థాయి వనభోజనాలు నిర్వహించి, బంధుత్వ బంధాలను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.* ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల అధ్యక్షులు తుమ్మలపల్లి సోమేశ్వర్ గారు, జిల్లా మరియు మండల స్థాయి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జై వాసవి జై జై వాసవి
జై ఆర్యవైశ్య జై జై ఆర్యవైశ్య
స్టేషన్గన్పూర్ (పున్నమి ప్రతినిధి)
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఈరోజు (26-10-2025, ఆదివారం) జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ —
నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, మా మహాసభ పునఃజీవితమై జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశేష కార్యకలాపాలు చేపట్టడం గర్వకారణ అని తెలిపారు.

*గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 సభ్యత్వాలను 2500 సభ్యత్వాలుగా పెంచడమే కాకుండా, వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం,*
*బతుకమ్మ పండుగను జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో 200 మందితో ఘనంగా నిర్వహించడం*,
*మరియు జిల్లా వ్యాప్తంగా 60 మంది ఉత్తమ ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు.*

అదేవిధంగా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన OC JAC సమావేశంలో జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఐక్యతను ప్రతిబింబించే విధంగా పాల్గొనడం గర్వకారణమని తెలిపారు.

డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను వివరించారు — *రాబోయే రోజుల్లో పేద ఆర్యవైశ్య బంధువులకు పుస్తెమట్టలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం*. *ఈ కార్తీకమాసంలో జిల్లా స్థాయి వనభోజనాలు నిర్వహించి, బంధుత్వ బంధాలను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.*

ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల అధ్యక్షులు తుమ్మలపల్లి సోమేశ్వర్ గారు, జిల్లా మరియు మండల స్థాయి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.