Sunday, 22 March 2026
  • Home  
  • ఆర్టీసీ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్”కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం :- ఇ. యు
- E-పేపర్

ఆర్టీసీ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్”కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం :- ఇ. యు

ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసి) ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపియస్ ఆర్టీసి గవర్నర్ పేట- 1&2 డిపోలు మరియు పాత బస్సుస్టాండ్ కు సంబందించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి దశబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు కు జి. జి.ఓ.యం.యస్. ఓ. నెం. 137 ద్వారా కట్ట బెట్టిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆది వారం ఆర్.టి.సి ఎంప్లాయీస్ యూనియన్. జిల్లా కార్యదర్శి ఆర్.యస్.రావు ఆధ్వర్యంలో నిశాంతి భవన్.. హాలులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనక్ సహాయ కార్యదర్శి వి.దేవసహాయం మాట్లాడుతూ ఈ గవర్నర్ పేట డిపోలకు-1&2 మరియు పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం రూ.16/- లతో సుమారు నాలుగు లక్షలు ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసినది. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార వేత్తలుకు దారాతత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు ఈ ప్రభుత్వం నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో బాగంలో “లూలూ షాపింగ్ మాల్” ను నగర శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్సుస్టాండ్ కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగష్టు 15 మహిళకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనుంది. ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడనుండి తొలగించడంవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జి.ఓ నెం. 137 తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలోని ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్ట బెట్టారు. అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం కూడా ఇవ్వలేదని అంతే కాకుండా 2017లో ఇదే గవర్నర్ పేట- 1&2 డిపోలు బఫర్ జోన్ కాలువ గట్టుపై ఉన్నాయని ఇంటర్ నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసిగా పోరాటం చేసి అడ్డకున్నాయి. అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరి ఉద్యోగులాగే ఆర్టీసీ ఉద్యోగులుగా కోరుకున్నాము కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన DA బకాయిలను చెలిస్తాము, 12 PRC కమిషన్ వేస్తాము IR కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాక పోవడంపై ఎంప్లాయిస్ యూనియన్గా తీవ్రముగా ఖండిస్తున్నాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటికే అలిపిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ బస్సులను ప్రైయివేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ వారికీ ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రెయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వమే సంస్థకు ఆర్ధిక సహాయం చేసి సంస్థే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహిచే విధంగా చర్యలు చెప్పట్టాలని కోరుతున్నాము దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని ఇ.యు నాయకులు V. దేవసహాయం అన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి డి.యన్.యస్.రాయుడు,జిల్లా ప్రచార కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు,డిపో అధ్యక్షులు కొండారెడ్డి,సహాయ కార్యదర్శి జి.యల్.రెడ్డి, సభ్యులు కాశీం,సుధాకర్ లు పాల్గొన్నారు

ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసి) ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపియస్ ఆర్టీసి గవర్నర్ పేట- 1&2 డిపోలు మరియు పాత బస్సుస్టాండ్ కు సంబందించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి దశబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు కు జి. జి.ఓ.యం.యస్. ఓ. నెం. 137 ద్వారా కట్ట బెట్టిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆది వారం ఆర్.టి.సి ఎంప్లాయీస్ యూనియన్. జిల్లా కార్యదర్శి ఆర్.యస్.రావు ఆధ్వర్యంలో నిశాంతి భవన్.. హాలులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనక్ సహాయ కార్యదర్శి వి.దేవసహాయం మాట్లాడుతూ ఈ గవర్నర్ పేట డిపోలకు-1&2 మరియు పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం రూ.16/- లతో సుమారు నాలుగు లక్షలు ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసినది. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార వేత్తలుకు దారాతత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు ఈ ప్రభుత్వం నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో బాగంలో “లూలూ షాపింగ్ మాల్” ను నగర శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్సుస్టాండ్ కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగష్టు 15 మహిళకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనుంది. ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడనుండి తొలగించడంవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జి.ఓ నెం. 137 తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలోని ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్ట బెట్టారు. అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం కూడా ఇవ్వలేదని అంతే కాకుండా 2017లో ఇదే గవర్నర్ పేట- 1&2 డిపోలు బఫర్ జోన్ కాలువ గట్టుపై ఉన్నాయని ఇంటర్ నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసిగా పోరాటం చేసి అడ్డకున్నాయి. అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరి ఉద్యోగులాగే ఆర్టీసీ ఉద్యోగులుగా కోరుకున్నాము కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన DA బకాయిలను చెలిస్తాము, 12 PRC కమిషన్ వేస్తాము IR కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాక పోవడంపై ఎంప్లాయిస్ యూనియన్గా తీవ్రముగా ఖండిస్తున్నాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటికే అలిపిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ బస్సులను ప్రైయివేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ వారికీ ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రెయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వమే సంస్థకు ఆర్ధిక సహాయం చేసి సంస్థే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహిచే విధంగా చర్యలు చెప్పట్టాలని కోరుతున్నాము దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని ఇ.యు నాయకులు V. దేవసహాయం అన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి డి.యన్.యస్.రాయుడు,జిల్లా ప్రచార కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు,డిపో అధ్యక్షులు కొండారెడ్డి,సహాయ కార్యదర్శి జి.యల్.రెడ్డి, సభ్యులు కాశీం,సుధాకర్ లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.