ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విజయవాడ ఆయుష్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు మడమనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జగదీశ్వరి తెలిపారు. శిబిరంలో గ్రామస్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఆయుర్వేదంలో శాశ్వత నివారణ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలోపతిలో నయం కాని వ్యాధులకు కూడా చికిత్సలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, ఫార్మసిస్ట్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

ఆయుష్ ఆదేశాలతో చెర్లోపల్లిలో ఆరోగ్య శిబిరం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విజయవాడ ఆయుష్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు మడమనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జగదీశ్వరి తెలిపారు. శిబిరంలో గ్రామస్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఆయుర్వేదంలో శాశ్వత నివారణ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలోపతిలో నయం కాని వ్యాధులకు కూడా చికిత్సలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, ఫార్మసిస్ట్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

