ఆపస్ ఆత్మీయ సన్మాన సమావేశం

    0
    81

    అనంతసాగరం మండలం స్థానిక జె జె ఎన్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఏపీ యు ఎస్) ఆధ్వర్యంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆత్మీయంగా సన్మాన సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పి సి వి రాఘవరెడ్డి ఉపాధ్యాయ సేవలో ఆపస్ అనంతసాగరం మండల శాఖ ఎనలేని సేవ చేస్తున్నది తెలియజేశారు. సన్మాన ఉత్సవంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులు, మహిళాఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆపస్ సీనియర్ కార్యకర్త చల్లా. సుధారాణి గారు మహిళా కార్యకర్తలు తరుపున ఆనందం వ్యక్తం చేస్తూ ఆపస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చంద్రగిరి. శ్రీనివాసులు ఆర్ .వెంకటరమణా రెడ్డి, వి .రామకృష్ణ రెడ్డి అధ్యక్షులు మైలి. వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి డి .వెంకు రెడ్డి, పి. శింబు కృష్ణ, ఎం .వెంకటయ్య బి. వెంకటేశ్వర్లు. ఏఎస్ పేట. మర్రిపాడు, ఆత్మకూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

    0
    0