Thursday, 26 March 2026
  • Home  
  • ఆపదలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. రక్షణ చర్యలపై విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ శిక్షణ
- తిరుపతి

ఆపదలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. రక్షణ చర్యలపై విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ శిక్షణ

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని ఎలా నివారించాలో, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో విద్యార్థులకు అవగాహన ఉండాలని 9వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులు అన్నారు. గురువారం నాడు పల్లంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. 9వ బెటాలియన్ కమాండెంట్ సాయి ప్రసాద్ మార్గదర్శకత్వంతో అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ కన్నా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్‌గా వివరించారు. ప్రమాద సమయంలో భవనాల నుంచి సురక్షితంగా బయటకు రావడం, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం వంటి అంశాలపై సిబ్బంది చేసిన ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని రక్షణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ధైర్యం, అప్రమత్తత పెరుగుతాయని పేర్కొంటూ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని ఎలా నివారించాలో, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో విద్యార్థులకు అవగాహన ఉండాలని 9వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులు అన్నారు. గురువారం నాడు పల్లంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. 9వ బెటాలియన్ కమాండెంట్ సాయి ప్రసాద్ మార్గదర్శకత్వంతో అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ కన్నా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్‌గా వివరించారు. ప్రమాద సమయంలో భవనాల నుంచి సురక్షితంగా బయటకు రావడం, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం వంటి అంశాలపై సిబ్బంది చేసిన ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని రక్షణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ధైర్యం, అప్రమత్తత పెరుగుతాయని పేర్కొంటూ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.