రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలంలోని సంక్రాతిపల్లి వద్ద తెలుగుగంగ 1 వ బ్రాంచి కాలువ వద్ద త్రాగు,సాగు నీటి అవసరాల కోసం అదనంగా 20 క్యూసెక్కుల నీటిని వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారయణ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల కష్టాలను గుర్తించి వారి పక్షాన వుండి అవసరమైన సందర్భంలో తెలుగు గంగ నుండి నీటిని విడుదల చేయడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తదుపరి సంక్రాంతి పల్లి సమీపాన (11.8 కిలోమీటర్ వద్ద) 2A బ్రాంచి కాలువను,చెర్లోపల్లి సమీపాన (19.00 కిలోమీటర్ల వద్ద) 2B బ్రాంచి కాలువ.అనంతరం గూడూరు-రాపూరు-వెంకటగిరి ఆర్ అండ్ బి మెయిన్ రోడ్ మీదుగా ప్రయాణంచేసి. డక్కిలి మండలం వెలికల్లు మెయిన్ రోడ్డు సమీపాన (28.56 కిలోమీటర్ల వద్ద) 3వ బ్రాంచ్ కాలువ,మోపూరు వడ్డిపల్లి సమీపాన (39.4 కిలోమీటర్ల వద్ద) 4వ బ్రాంచ్ కాలువ.వెంకటగిరి మండలం జంగాలపల్లి (48.32 కిలోమీటర్ల వద్ద) 5ఏ బ్రాంచ్ కాలువ.(బంగారు పేట సమీపాన),బాలాయపల్లి మండలం ఉాట్లపల్లి సమీపాన – నాయుడుపేట రోడ్డు వైపు (53.4 కిలోమీటర్ల వద్ద) 5వ బ్రాంచ్ కాలువ లను స్థానిక రైతులతో కలసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ అధికారులు,ఇరిగేషన్ అధికారులు రాపూరు,సైదాపురం మండలం వై.సి.పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఆనం రామనారయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ పరిధి లోని తెలుగు గంగ బ్రాంచ్ కాలువ పరిశీలిన.
రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలంలోని సంక్రాతిపల్లి వద్ద తెలుగుగంగ 1 వ బ్రాంచి కాలువ వద్ద త్రాగు,సాగు నీటి అవసరాల కోసం అదనంగా 20 క్యూసెక్కుల నీటిని వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారయణ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల కష్టాలను గుర్తించి వారి పక్షాన వుండి అవసరమైన సందర్భంలో తెలుగు గంగ నుండి నీటిని విడుదల చేయడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తదుపరి సంక్రాంతి పల్లి సమీపాన (11.8 కిలోమీటర్ వద్ద) 2A బ్రాంచి కాలువను,చెర్లోపల్లి సమీపాన (19.00 కిలోమీటర్ల వద్ద) 2B బ్రాంచి కాలువ.అనంతరం గూడూరు-రాపూరు-వెంకటగిరి ఆర్ అండ్ బి మెయిన్ రోడ్ మీదుగా ప్రయాణంచేసి. డక్కిలి మండలం వెలికల్లు మెయిన్ రోడ్డు సమీపాన (28.56 కిలోమీటర్ల వద్ద) 3వ బ్రాంచ్ కాలువ,మోపూరు వడ్డిపల్లి సమీపాన (39.4 కిలోమీటర్ల వద్ద) 4వ బ్రాంచ్ కాలువ.వెంకటగిరి మండలం జంగాలపల్లి (48.32 కిలోమీటర్ల వద్ద) 5ఏ బ్రాంచ్ కాలువ.(బంగారు పేట సమీపాన),బాలాయపల్లి మండలం ఉాట్లపల్లి సమీపాన – నాయుడుపేట రోడ్డు వైపు (53.4 కిలోమీటర్ల వద్ద) 5వ బ్రాంచ్ కాలువ లను స్థానిక రైతులతో కలసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ అధికారులు,ఇరిగేషన్ అధికారులు రాపూరు,సైదాపురం మండలం వై.సి.పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

