*
*ఆత్మకూరులో లివర్ వ్యాధుల పైన, లివర్ మార్పిడి పైన అవగాహన సదస్సు*
*ముఖ్య అతిథిగా పాల్గొన్న*
*మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.*
*మర్రిపాడు ఏప్రిల్ (పున్నమి ప్రతినిది)*
ఇది మంచి ప్రోగ్రాం అని, ఆత్మకూరుకు ఇది తప్పకుండా కావాలని చెప్పారు. బిజీ షెడ్యూల్లో కూడా మంత్రి అనంరామ నారాయణ రెడ్డి గారు ఈ సభకు హాజరయ్యారంటే అది వారి నిబద్ధతకు నిదర్శనం.
రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, కానీ ప్రజల కష్టాన్ని తమ కష్టంగా భావించే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన నాయకుల్లో మొదటి వరుసలో ఉండే వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు.
గతంలో ఆర్థిక మంత్రిగా, ఆనం గారు మురగళ్ళ గ్రామ ప్రాంతంలో ఉన్న బంజరు భూములను మాగాణిగా మార్చినటువంటి భగీరథుడు. అప్పట్లో ఒక పంటకే కష్టపడే రోజులు ఉండేవి, ఇప్పుడు రెండు పంటలు పండించుకుని ప్రజలందరూ చాలా సుఖశాంతులతో ఉన్నారు.
మురగళ్ళ ప్రజల తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్.
ఆనం ప్రజల సమస్యలు వినడానికి ఎప్పుడూ ముందుంటారు. రాత్రి అయినా, పగలైనా ఏ టైమ్లో ఫోన్ చేసినా విని, దానికి స్పందించి, ఇచ్చిన మాటకి కట్టుబడి పని చేస్తారు.నియోజకవర్గ అభివృద్ధికి ఆనం గారు వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు అనేది ఆయన స్లోగన్. రైతులకు సాగునీరు, ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే విద్యకు, ఆరోగ్యానికి మొదటి పీట వేస్తారు.
* మన ఆత్మకూరులోనే 100 పడకల హాస్పిటల్ రావడానికి ఎంతో కృషి చేసి, దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా తీసుకురావడంలో ఆయన కృషి అనిర్వచనీయం.
* ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి యువకుడికి అవకాశాలు రావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సేవ చేస్తున్నారు అని కొనియాడారు…
గ్లెనీగల్స్ హాస్పిటల్స్,చెన్నై వారి ఆధ్వర్యంలో డాక్టర్ పచ్చా రజనీకాంత్ నిర్వహించిన లివర్ మార్పిడీ అవగాహన మరియు విజయోత్సవ సభ విజయ వంతం చేశారు.
ఆత్మకూరు తేదీ



