ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలను ఎంఈఓ డి. ప్రేమలత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి వంటగది శుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించి తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కొంతమంది విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా స్థాయిని అంచనా వేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలను ఆకస్మిక తనిఖీచేసిన ఎంఈఓ ప్రేమలత
ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలను ఎంఈఓ డి. ప్రేమలత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి వంటగది శుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించి తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కొంతమంది విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా స్థాయిని అంచనా వేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

