
విశాఖపట్నం:
చిత్త శుద్ధితో క్రీడాకారులుగా ఎదిగి తల్లి దండ్రులు విద్యనేర్చిన గురువుల నమ్మకాల్ని నిలబెట్టాలని పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి పేర్కొన్నారు. శ్రీ మన్మధురావు మెమోరియల్ క్లబ్ ఈ నెల 10న ప్రారంభించిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ముగింపు లో డా. శంఖ బ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓర్క్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విన్నర్ గాను,
సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ విద్యార్థులు రన్నర్ గాను ట్రోఫీ లు అందుకున్నారు.
స్టీల్ప్లాంట్ స్కూల్ విద్యార్థుల టీమ్, తిమ్మాపురం విజ్ఞాన్ విద్యార్థులు, ప్రత్యేక ట్రోఫీని అందుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా. శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ బాస్కెట్ బాల్ క్రీడ గొప్పదన్నారు. మనదేశంలోనూ బాస్కెట్ బాల్ క్రీడను టాప్ లోకి తీసుకు వెళ్లి అనుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు. ఏఐ టెక్నాలజీ తో దేశంలోనే మొదటిసారిగా పాట ను సృష్టించి సంచలనం పేరు తెచ్చుకున్న అడ్డూరి సునీల్ చరణ్, ప్రభుత్వ పి.ఇ. టి లలిత్ కుమార్, డా.రవి, డా. కళ్యాణ్ చక్రవర్తి, అధ్యక్షులు రామ్మోహన్ రావులు అతిథులుగా పాల్గొన్నారు. గత 19 ఏళ్లుగా ఉచితంగా బాస్కెట్ బాల్ శిక్షణ ఇస్తున్న అన్నెపు రామచందర్ మాట్లాడుతూ తన ఉచిత శిక్షణ లక్ష్యంకు ఎయు క్రీడా విభాగం ఇస్తున్న ప్రోత్సాహం గుర్తు చేశారు. పి.ఇ.టి డైరెక్టర్ ఆచార్య ఎన్.విజయ మోహన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైన్స్ విభాగాధిపతి డా. ఎ. పల్లవి లు సహకరిస్తున్న తీరును ప్రస్తావించారు. బి.ఎస్ చంద్ర శేఖర్ మాస్టర్ ఆఫ్ శర్మనీగ వ్యవహరించిన కార్యక్రమంలో చెలమరెడ్డి మహేష్, చంద్రశేఖర్, సూరిబాబు పొట్నూరూ, శివకుమార్, బోర వెంకటేశ్వర రెడ్డి తదితరులు టోర్నమెంట్ నిర్వహణలో భాగస్తులయ్యారు.


