చిట్వేల్ ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) శివ
చిట్వేల్ గ్రామంలోని శివాలయంలో ఆడికృతిక శుభసందర్భంగా, శనివారము రోజున. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో. విశిష్టమైన ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేదఘోషాల నడుమ, అభిషేకము, శాస్త్రోక్తంగా జరిగి, అనంతరం పుష్పాలు, పండ్లు, రత్నాభరణాలతో. అద్భుతమైన అలంకరణ చేసి. స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారంలో గోపూజ పంచసూక్త ప్రకారంగా స్వామి వారికి పంచామృతం అభిషేకం సకల ద్రవ్యాలతో అభిషేకం వంటి పుణ్యకార్యాలు నిర్వహించబడ్డాయి. ఉత్సవాల్లో దూరదూరాల నుండి తరలి వచ్చిన భక్తులు పాల్గొని దైవానుభూతిని పొందారు. కార్యక్రమాలను ఆలయ పూజారులు పవన్ శర్మ , మరియు సురేంద్ర శర్మ గారు శ్రద్ధాభక్తులతో నిర్వహించగా, నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి , హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.


