✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యః
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్న జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రవాణా శాఖకు చెందిన సాయంకేతిక సిబ్బంది స్థానిక రెవిన్యూ మరియు పోలీస్ శాఖ బృందాలతో కలిపి దేవరపల్లి గ్రామంలో
ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది అని భూగర్భ శాఖ అధికారి ఫణి భూషణ్ రెడ్డి తెలియజేశారు ఇతనికి సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏపీ 39 యు ఈ 4149 మరియు ఏపీ 39 యు బి 8555 నెంబర్లతో ఉన్న రెండు లారీలు గుర్తించి తనిఖీ చేయడం జరిగిందన్నారు వాహనాల డ్రైవర్లు చూపమని అడగగా తమ వద్ద ఇటువంటి బిల్లులు లేవని తెలిపారు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయ రికార్డు పరిశీలనలో రెండు వాహనాలు అంతర్రాష్ట్ర ఇసుక అక్రమ రవాణా కార్య కలాపాలలొ పాల్గొన్నట్లు నిర్ధారణ రావటంతో తెలంగాణ రాష్ట్రంలో ఆయా వాహనాలపై ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. వాహనాలను బ్లాక్ చేయడం జరిగింది అనంతరం అక్రమ ఇసుక రవాణా చేసినందుకు తదుపరి చర్యలు నిమిత్తం సదురు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. ఈ వాహనాలపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
END


