ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, విశాఖపట్నం సిటీలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు (సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్) నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం గురువారం విశాఖపట్నం విచ్చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. సదస్సు నిర్వహణలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, సమన్వయ చర్యలపై చర్చించారు.


