*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*
*అమరావతి డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలోని తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ‘వన్ టూ వన్’ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గౌll శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
*నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను డి సిఎం గారికి వివరించిన ఎమ్మెల్యే వంశీ గారు*
*నియోజవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభ్యర్థన*
*సమావేశంలోని ముఖ్య అంశాలు:*
*అభివృద్ధి పనుల సమీక్ష* : దక్షిణ నియోజకవర్గం లోఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంకు వివరించారు.
*
*పనుల పురోగతి* : నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు మేజర్ పనుల ప్రస్తుత స్థితిగతులు, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మరియు సహాయ సహకారాలపై చర్చించారు.
*స్థానిక సమస్యలు* : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వాటిలో ముఖ్యంగా ఎండోమెంటు సమస్యను వివరించారు.
**పార్టీ బలోపేతం* : నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు క్యాడర్ను సమన్వయం చేసుకునే అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు.


