అరకులోయ (పున్నమి ప్రతినిధి), నవంబర్:1 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం APDMC ఆరోగ్య రధం వారితో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవాలన్నారు. ఆరోగ్య రధం డాక్టర్ జి కుశల్ చైతన్య 68 మందికి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి కొండబాబు, ఎన్ఎస్ఎస్ పిఓలు నాగబాబు, విజయలక్ష్మి, అనిత కుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరోగ్య రధం వైద్య శిబిరం
అరకులోయ (పున్నమి ప్రతినిధి), నవంబర్:1 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం APDMC ఆరోగ్య రధం వారితో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవాలన్నారు. ఆరోగ్య రధం డాక్టర్ జి కుశల్ చైతన్య 68 మందికి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి కొండబాబు, ఎన్ఎస్ఎస్ పిఓలు నాగబాబు, విజయలక్ష్మి, అనిత కుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

