శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్ర రాజధానిగా ఎంపికైన అమరావతి నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల త్యాగానికి ‘అమరావతి’ ప్రతీకగా నిలుస్తుందని తంగేళ్ళపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని విషయంలో కొనసాగుతున్న అనిశ్చితికి తెరదిస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీసుకున్న చారిత్రాత్మక తీర్మానాన్ని వారు స్వాగతించారు. ఈ నిర్ణయంతో రైతుల ఆశలు నెరవేరాయని, వారి త్యాగానికి సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. గతంలో రాజధాని అంశంపై జరిగిన వివాదాలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తించినప్పటికీ, తాజా నిర్ణయం ఆ అనిశ్చితిని పూర్తిగా తొలగించిందన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇకపై ప్రతి ఆంధ్రుడు గర్వంగా తమ రాజధాని అమరావతి అని చెప్పగలడని తెలిపారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నగరానికి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానానికి హర్షం – రైతుల త్యాగానికి న్యాయం
శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్ర రాజధానిగా ఎంపికైన అమరావతి నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల త్యాగానికి ‘అమరావతి’ ప్రతీకగా నిలుస్తుందని తంగేళ్ళపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని విషయంలో కొనసాగుతున్న అనిశ్చితికి తెరదిస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీసుకున్న చారిత్రాత్మక తీర్మానాన్ని వారు స్వాగతించారు. ఈ నిర్ణయంతో రైతుల ఆశలు నెరవేరాయని, వారి త్యాగానికి సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. గతంలో రాజధాని అంశంపై జరిగిన వివాదాలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తించినప్పటికీ, తాజా నిర్ణయం ఆ అనిశ్చితిని పూర్తిగా తొలగించిందన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇకపై ప్రతి ఆంధ్రుడు గర్వంగా తమ రాజధాని అమరావతి అని చెప్పగలడని తెలిపారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నగరానికి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

