విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రగతిపై మున్సిపల్ మంత్రి పి.నారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ అయ్యారు. కొత్తగా అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు భీమిలి పరిసరాల్లో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. భీమిలిలో మూడు ప్రధానమైన రోడ్ల విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని గంటా పేర్కొన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది జులై నాటికి అందుబాటులోకి వస్తున్నందున కనెక్టింగ్ రోడ్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలన్నారు. మధురవాడ ప్రాంతానికి మంజూరైన రూ. 460 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రూ.500 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. గంటా ప్రస్తావించిన అంశాలపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. భేటీలో కమిషనర్ కేతన్ గార్గ్, గంటా రవితేజ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి మంత్రి నారాయణ తొ గంటా భేటీ
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రగతిపై మున్సిపల్ మంత్రి పి.నారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ అయ్యారు. కొత్తగా అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు భీమిలి పరిసరాల్లో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. భీమిలిలో మూడు ప్రధానమైన రోడ్ల విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని గంటా పేర్కొన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది జులై నాటికి అందుబాటులోకి వస్తున్నందున కనెక్టింగ్ రోడ్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలన్నారు. మధురవాడ ప్రాంతానికి మంజూరైన రూ. 460 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రూ.500 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. గంటా ప్రస్తావించిన అంశాలపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. భేటీలో కమిషనర్ కేతన్ గార్గ్, గంటా రవితేజ పాల్గొన్నారు.

