అభిమానం అక్షర సాక్షిగా తరుమారైంది…
నేతల హోదాలు మారిపోయాయి…
రెట్టించిన అభిమానంతో…
నెల్లూరు, అక్టోబర్ 26 (పున్నమి విలేకరి) : అభిమాన నాయకులు.. అధినేతలు వస్తున్నారంటే క్యాడర్ లో ఉత్సవాహం ఉరకలేస్తుంది.ముఖ్యంగా సినీ రాజకీయ నేతల అనుచరుల్లో ఇది మరీ ఎక్కువ….ఒక్కోసారి మితిమీరిన అభిమానం. అతిధులు… అధినాయకులకు…అభిమాన నేతలను చాలా ఇబ్బందులు తెస్తుంది….. అలాంటిదే నెల్లూరులో ఓ పోస్టర్ లో బయటపడింది… నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్,ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వై సుజనా చౌదరి నెల్లూరు రానున్నారని ఆ పార్టీ నాయకులు బ్యానర్లు, పోస్టర్లు,ఫ్లెక్సీలు వేశారు..
అందులోను నెల్లూరులో సత్యకుమార్ కి నెల్లూరు నేతలు చిరకాల అనుబంధం ఉంది.. సత్యకుమార్ గతంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు… దీంతో సత్యకుమార్ కి స్వతహాగా నెల్లూరు బీజేపీ, సంఘ్ నేతలతో పేర్లతో పిలవగలిగే పరిచయాలు ఉన్నాయి.. ఇటీవల వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక అప్పటి నాయుడు గారి టీమ్ అంతా ఇప్పుడు సత్యకుమార్ తో ఉంటోంది.. ఒకరకంగా చెప్పాలంటే నాయుడు ఫాలోయర్లందరూ ఇప్పుడు సత్య వెంట ఉన్నారు.. అలాంటి అనుబంధముంటే నెల్లూరోళ్ళ హంగామా గురించి చెప్పాలనా… పావలాకి రూపాయి బిల్డప్ …సత్యాపై ఉన్న అభిమానంతో… నగరంలోని విఆర్సీ సెంటర్లో నెల్లూరు క్లబ్ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి పేరుతో అభిమానులు ఒక ఫ్లెక్సీ కట్టారు..అందులో ఫ్లెక్సీ నిర్వాహకుల పొరపాటో.. మరి ఉత్సాహమో..తెలియదుగానీ….బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ని ఎంపీ గానూ… ఎంపీ సుజనా చౌదరిని బీజేపీ జాతీయ కార్యదర్శి గానూ గౌరవించారు… ఫ్లెక్సీలో..ఆ ఫ్లెక్సీ నిత్యం రద్దీగా ఉండే విఆర్సీ సెంటర్ కావడంతో అది కాస్తా సోషల్ మీడియాకెక్కి హడావుడి చేస్తోంది… అందుకే ప్లెక్సీ లైన.. పోస్టర్ లైన ఒకసారి చెక్ చేసుకోవాలి.. మరీ..