అబుదాబిలోని అల్ షహామా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణి శకలాలు తగలడంతో ఒక భారత జాతీయుడు గాయపడ్డాడు. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న అనంతరం ఒక ప్రాంతంలో శకలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది.

అబుదాబిలో క్షిపణి శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు
అబుదాబిలోని అల్ షహామా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణి శకలాలు తగలడంతో ఒక భారత జాతీయుడు గాయపడ్డాడు. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న అనంతరం ఒక ప్రాంతంలో శకలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది.

