అప్పనపల్లి, నవంబర్ 11 (పున్నమి ప్రతినిధి):
అప్పనపల్లి ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి, మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అబుల్ కలాం ఆజాద్ గారి సేవలను స్మరించారు. ఆయన దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధి, విశ్వవిద్యాలయాల స్థాపన, విద్యా హక్కు విస్తరణలో చేసిన కృషిని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నైనాల రఘు రామయ్య మాట్లాడుతూ, “మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విజన్ వల్లే నేటి భారత విద్యా వ్యవస్థ బలమైన పునాదులపై నిలిచింది” అని పేర్కొన్నారు.
అలాగే విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంచే దిశగా ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో బాలెం రామకృష్ణ, బాలెం పెద్దిరాజు, షబ్బీర్ హుస్సేన్, అనంతలక్ష్మి దేవి తదితరులు పాల్గొని మౌలానా ఆజాద్ గారి విప్లవాత్మక ఆలోచనలను స్మరించారు.
కార్యక్రమం చివరగా విద్యార్థులు ఆయన జీవిత చరిత్రపై వ్యాస రచన, ప్రసంగ పోటీలు నిర్వహించారు.


