అన్నారు గూడెం గ్రామంలో ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
అన్నారు గూడెం గ్రామంలో ఈరోజు ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నవభారత్ ఐ సెంటర్ వారి సౌజన్యంతో, తల్లాడ విజన్ టెక్నీషియన్ శ్రీమతి వినోద గారి ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఘనంగా నిర్వహించబడింది.
ఈ శిబిరంలో గ్రామ ప్రజల నుండి 150 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, 100 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, గ్రామస్థులు, మా గ్రామాన్ని ఎన్నుకొని సేవలందించిన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి మరియు వారి డాక్టర్ల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిబిరంలో సేవలందించిన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బృంద సభ్యులు:
• అడ్మినిస్ట్రేటర్ శ్రీ దేవి చందర్రావు
• విజన్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ సాయి తేజ
• విజన్ టెక్నీషియన్ శ్రీమతి రాయపాటి వినోద, శ్రీమతి స్నేహ చైతన్య విజయలక్ష్మి
• ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీమతి జ్యోతి సారిక
గ్రామస్థులకు సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆ.పతి వెంకట రామారావు, దొడ్డ శ్రీనివాసరావు, ఎల్లంకి వెంకటేశ్వర్లు, చింతల నరేష్, గాదె కృష్ణారావు,పెరిక కిరణ్,తమ్మిశెట్టి కృష్ణ, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, తంబళ్ల రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

