రైల్వే కోడూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి):
ప్రపంచ శాంతి కోసం మానవతా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఉదయం స్టేట్ బ్యాంకు వద్ద ప్రారంభమైన ర్యాలీ, కడప-మద్రాస్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ కె. ప్రసాద్ వర్మ, కో-చైర్మన్ టి. వెంకటరమణ యాదవ్, కార్యదర్శి ఆర్. చెంగల్ రెడ్డి, కన్వీనర్ సి. నాగేంద్ర, కోశాధికారి పి. నిరంజన్తో పాటు డైరెక్టర్స్ కె. బాలకృష్ణం రాజు, ఏ. శ్రీనివాసరాజు, యస్. మస్తాన్ సాహెబ్, నరసరామిరెడ్డి, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఏపీజీపీ మేనేజర్ వాసు, నాగరాజు, మునికృష్ణ, ఉంగరాల కృష్ణ, కె. మోహన్ రాజు, రవి, శ్రీను, రవి వర్మ, మధుసూదన్ రెడ్డి, కె. సుబ్రహ్మణ్యం రాజు, జయచంద్ర రాజు, పి. కృష్ణయ్య, రాఘవ రాజు, తులసి వెంకటేష్, చెంగలరాజు, కోటి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ ర్యాలీ ద్వారా సమాజంలో శాంతి, సౌహార్దం, మానవత్వం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


