సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి)
సీతారామపురం మండలంలోని బోడ సిద్ధాయ పల్లి గ్రామానికి చెందిన సవరం పద్మావతి అనే మహిళ పక్షవాతంతో మంచాన పడిన విషయాన్ని తెలుసుకుని బాదిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సోంపల్లి టిడిపి నాయకుడు నేదురుపల్లి రవి సహకారంతో సీతారామపురం సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను బాధిత కుటుంబానికి అందజేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి సీతారామపురం మండలంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న పెనుబడి రఘురాములు ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి నేదురుపల్లి రమేష్, టిడిపి నాయకులు నేదురుపల్లి రవి,జోడు ఓబయ్య, బూత్ కన్వీనర్ బందుగుల రమణయ్య, బూత్ ప్రచార కార్యదర్శి
భూతపాటి వెంకటరమన, గ్రామ కమిటీ మెంబర్ బత్తల రవి తదితరులు పాల్గొన్నారు.


