శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తన నియోజకవర్గంలోని సీనియర్ కార్యకర్తల పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రస్తుతం తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బృందమ్మ స్వయంగా ఆసుపత్రికి విచ్చేసి ఈశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. పార్టీ అభివృద్ధిలో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న ఈశ్వర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ పెద్దగా బృందమ్మ స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనారోగ్యంతో ఉన్న టిడిపి నేతను పరామర్శించి ధైర్యం చెప్పిన బొజ్జల బృందమ్మ
శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తన నియోజకవర్గంలోని సీనియర్ కార్యకర్తల పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రస్తుతం తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బృందమ్మ స్వయంగా ఆసుపత్రికి విచ్చేసి ఈశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. పార్టీ అభివృద్ధిలో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న ఈశ్వర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ పెద్దగా బృందమ్మ స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

