
అనకాపల్లి జిల్లాలోని బల వంతపు భూసేకరణ వెంటనే ఆపాలని బుధవారం ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టి రెవెన్యూ మంత్రి అలగాని సత్యప్రసాద్ సి సి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్వవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్ రాష్ట్రఅధ్యక్షులు దడాలసుబ్బారావు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి వ్వవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు డి వెంకన్న తోపాటు సంఘం నాయకులు పాల్గొని వినతిపత్రం సమర్పించడం జరిగింది అనకాపల్లిజిల్లాలోని బల వంతంగా రైతు కూలీలను భయ భ్రాంతులకు గురిచేస్తు దేశ సరి హద్దుల్లో సైన్యాన్ని మొహ రించినట్లు భూసే కరణ చేసి గ్రామాలలో రైతులను కూలీలను ఇళ్ల నుండి బయటకు రానీయ కుండా బంధువులను సైత ఆ,గ్రామాలలోకి రానీయకుండా అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా ప్రవర్తిస్తు.వారికి మద్దతుగా వెళ్లిన నాయకులను సైతం ముందస్తు అరెస్టులు చేస్తూ రైతు,కూలీల మనో ధైర్యాన్ని దెబ్బ తీసి భూములు లాక్కొని బయటకి మాత్రం వారి కోరిక మేరకే భూములు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం బుకాయి స్తుందనీ. తెలిపారు బల వంతంగా భూములను గుంజు కొని పర్యావరణానికి హానిచేసే కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు పెట్ట డానికి,అభివృద్ధి పేరుతో గతంలో పరవాడలో ఫార్మాసిటీ కోసం 3064 ఎకరాలు, అచ్యుతాపురంలో ఎస్ఇజెడ్ కోసం 9,174 ఎకరాలు,రాంబిల్లి, ఎస్.రాయవరంలో ఎన్ఎఒబి కోసం 5,300 ఎకరాలు, మునగపాకలో లాజిస్టిక్ హబ్ కోసం 374 ఎకరాలు, సబ్బవరంలో లామేరియన్ పెట్రోలియం యూనివర్సిటీల కోసం 272 ఎకరాలు తీసుకుని కొన్ని పరిశ్రమలు నిర్మించారని పేర్కొన్నారు ఇంకా వేల ఎకరాలు భూములు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇక్కడ నిర్మించిన కంపెనీల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో నేటికీ మౌళిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈభూములు చాలవన్నట్లు దేవరాపల్లి మండలం లోని చింతల పూడి సమ్మేద పల్లపు కోడాబు పరివాహక ప్రాంతంలో ఆదాని హైడ్రో పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం 820 ఎకరాలు, ఎస్ఇజెడ్ల కోసం కె.కోటపాడులోని.ఆర్లే చింతపాక గరుగుబల్లి గుల్లేపల్లి ప్రాంతంలోని 1200 ఎకరాలు, బుచ్చయ్య పేట మండలం లోని 1691 ఎకరాల భూములను బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. మా భూములు ఇవ్వబోమని, కాలుష్యకరమైన పరిశ్రమలు మా ప్రాంతాల్లోపెట్టొదని.రైతులు,కూలీలు గిరిజనులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా ప్రైవేట్ వ్యక్తుల లాభాలే ద్యేయంగా బలవంతంగా భూ సేకరణ చేయడానికి పూను కుంటుందని,తెలిపారు నక్కపల్లి రాజయ్యపేటలో బల్క్ డ్రంగ్క్ వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ఈనెల 27 మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం పబ్లిక్ హిరింగ్ జరుపుతున్నారని దీన్ని ప్రజలు పూర్తిగా వ్యతి రేఖిస్తున్నారని అయినప్పటికి బలవంతంగా పబ్లిక్ హిరింగ్ జరుపుతున్నారని దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు 2013 భూ సేకరణ చట్టాన్ని ఎక్కడా అమలు చేయడం లెదన్నారు నిర్వా సితులకు చట్ట ప్రకారం ఎక్కడా పరిహారం, ఫ్యాకేజీ ఇవ్వ లెదన్నారు.భూములు,కోల్పోయిన ఏఒక్కరైతు బిడ్డ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వ లేదని తెలిపారు పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించ కుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఇస్తున్నారని తెలిపారు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తోందని దుయ్య బట్టారు మా భూములు జోలికి వస్తే ఖబడ్డార్ అని పాల కులకు తెలియ జేయడానికే ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు వెంటనే జిల్లాలోని బలవంతపు భూసేకరణ ఆపాలని వినతి పత్రంలో పేర్కొన్నారు

