Wednesday, 10 December 2025
  • Home  
  • అత్యంత విషాదకరంగా చెన్నైలో నెల్లూరు డాక్టర్‌ అంత్యక్రియలు…
- Featured - ఆంధ్రప్రదేశ్

అత్యంత విషాదకరంగా చెన్నైలో నెల్లూరు డాక్టర్‌ అంత్యక్రియలు…

‘‘విధి ఒక విషవలయం, విషాద కథ కది నిలయం’’ ` అన్నాడు ఒక సినీ కవి. ఇది నిన్న చెన్నైలో మరణించిన డా.క్ష్మీనారాయణ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. కరోనాతో జీవితాన్ని చాలించిన డాక్టర్‌ అంత్యక్రియు నిన్న అత్యంత విషాదకరంగా చెన్నైలో ముగిశాయి. డాక్టర్‌ కరోనాకు బలైపోవడం ఒక ఎత్తయితే ఆయన భార్యకు కరోనా వైరస్‌ సోకడంతో నెల్లూరులో చికిత్స పొందుతుండడం, బిడ్డ మరో చోట వుండడం, గుండెల్ని పిండేసే సంఘటను. భర్తను కడసారి చూచుకునే అదృష్టానికి ఆ భార్యా, బిడ్డా నోచుకోకపోవడం మరింత విషాదకరం. అలానే ఆయన మిత్రుల0తా చివరి చూపుకు నోచుకోకపోయారు. డాక్టర్‌ అంత్యక్రియలుకు హాజరుకాలేక కడసారి చూపుకు దూరమయ్యారు. డాక్టరు ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిని చేపట్టి ఉంటారు. తన జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలని, ఆరేళ్ల కుమారుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఎన్నో కలలు కనివుంటారు. చివరకు కరోనా కాలసర్పానికి బలైపోయారు. డాక్టరు అంత్యక్రియలకు చెన్నై కార్పొరేషన్‌ ముందు ససేమిరా అంది. ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు గనుక మేము చేయలేమని చెప్పిన స్మశాన సిబ్బంది, పార్థివ దేహాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది హృదయవిదారకంగా మారిన పరిస్థితి. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారుల జోక్యంతో పోరూరు స్మశాన వాటికలో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కార్పొరేషన్‌ సిబ్బంది పూర్తి చేశారు. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దురా బాబూ అనుకుంటున్నారు నెల్లూరు ప్రజలు.

‘‘విధి ఒక విషవలయం, విషాద కథ కది నిలయం’’ ` అన్నాడు ఒక సినీ కవి. ఇది నిన్న చెన్నైలో మరణించిన డా.క్ష్మీనారాయణ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. కరోనాతో జీవితాన్ని చాలించిన డాక్టర్‌ అంత్యక్రియు నిన్న అత్యంత విషాదకరంగా చెన్నైలో ముగిశాయి.
డాక్టర్‌ కరోనాకు బలైపోవడం ఒక ఎత్తయితే ఆయన భార్యకు కరోనా వైరస్‌ సోకడంతో నెల్లూరులో చికిత్స పొందుతుండడం, బిడ్డ మరో చోట వుండడం, గుండెల్ని పిండేసే సంఘటను. భర్తను కడసారి చూచుకునే అదృష్టానికి ఆ భార్యా, బిడ్డా నోచుకోకపోవడం మరింత విషాదకరం.
అలానే ఆయన మిత్రుల0తా చివరి చూపుకు నోచుకోకపోయారు. డాక్టర్‌ అంత్యక్రియలుకు హాజరుకాలేక కడసారి చూపుకు దూరమయ్యారు. డాక్టరు ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిని చేపట్టి ఉంటారు. తన జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలని, ఆరేళ్ల కుమారుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఎన్నో కలలు కనివుంటారు. చివరకు కరోనా కాలసర్పానికి బలైపోయారు.
డాక్టరు అంత్యక్రియలకు చెన్నై కార్పొరేషన్‌ ముందు ససేమిరా అంది. ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు గనుక మేము చేయలేమని చెప్పిన స్మశాన సిబ్బంది, పార్థివ దేహాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది హృదయవిదారకంగా మారిన పరిస్థితి. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారుల జోక్యంతో పోరూరు స్మశాన వాటికలో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కార్పొరేషన్‌ సిబ్బంది పూర్తి చేశారు. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దురా బాబూ అనుకుంటున్నారు నెల్లూరు ప్రజలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.