గురువారం అనంతసాగరం జనసంద్రంగా మారింది అశేష జనవాహినితో కలిసి రాపూరు వెంకట సుబ్బారెడ్డి గారు బట్రెడ్డి జనార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా వైసిపి సర్పంచ్ అభ్యర్థి కమతం శోభ తన నామినేషన్ దాఖలు చేశారు వీరితో పాటు 14 వార్డులకు గాను 14 మంది వార్డు నెంబర్ లు కూడా నామినేషన్ దాఖలు చేశారు.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి అనంతసాగరం మండలం లో నామినేషన్ల చివరి రోజు ముగిసేనాటికి మొత్తం 25 గ్రామపంచాయతీలకు 121 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అలాగే మండలంలో మొత్తం 226 వార్డులకు గాను 465 మంది దాఖలు చేశారు మండలంలోని చిలకమర్రి గ్రామంలో ఒకే ఒక్క సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశారు అధికారులు ఏకగ్రీవం ప్రకటించడమే తరువాయి

