*విజయనగరం డిసెంబర్ 19 విశాఖ పున్నమి ప్రతినిధి*
*బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్*
అటల్ మోడీ సుపరిపాల యాత్ర ద్వారా ఏపీలో 26జిల్లాల్లో వాజ్ పేయ్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం
ఆయన గొప్పతనంతో పాటు, మోడీ అందిస్తున్న సుపరిపాలను వివరించేలా సభలు ఏర్పాటు చేశాం
వాజ్ పేయ్ గురించి అన్ని విధాలా తెలిసిన వ్యక్తి.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ శభాష్ అనిపించుకున్న వ్యక్తి మన తెలుగు వారు వెంకయ్యనాయుడు
వాజ్ పేయ్, వెంకయ్యనాయుడు, మోడీలకు సారూప్యత ఉంది
వారంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చి తమ కృషితో ఎదిగిన వ్యక్తులు
వాజ్ పేయ్ కోసం పని చేసిన వెంకయ్యనాయుడు.. ఆతర్వాత కేంద్రగ్రామీణ అభివృద్ది శాఖ మంత్రిగా వాజ్ పేయ్ కలలను నెరవేర్చారు
మోడీ ఆలోచనలను కూడా ఆతర్వాత వెంకయ్యనాయుడు ముందుకు తీసుకు వెళ్లారు
ఈ కార్యక్రమానికి రావడానికి వెంకయ్యనాయుడు ఎంతో శ్రమ తీసుకున్నారు
మా నాన్న గారు చలపతిరావుగారు, వెంకయ్యనాయుడుగారు కలిసి పని చేశారు
ఈ యాత్రలో సభలో వెంకయ్యనాయుడు పాల్గొనడం నిండుదనాన్ని ఇచ్చింది
అటల్ జీ సామాన్య కుటుంబంలో పుట్టి… స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్లారు
ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా.. తన జీవితాన్ని భారతదేశ సేవకు అంకితం చేశారు
దేశ విభజన మరోసారి జరగకూడదని భారతీయ సంఘ్ ఏర్పాటు చేశారు
1962 లో చైనా యుద్దానికి రావడంతో.. మనం కొంత వెనుక బడాల్సి వచ్చింది
మన దేశం అణుశక్తిగా ఎదగాలని చెప్పినా.. ఎవరూ వినలేదు
వాజ్ పేయ్ చెప్పిన అంశం నిజమని… నెహ్రూ కూడా ఆతర్వాత మద్దతు ఇచ్చారు
1998 లో వాజ్ పేయ్ ప్రధాని అవగానే అణు విస్పోటనం చేసి.. భారతదేశాన్ని అణుబాంబు శక్తిగా మార్చారు
మన దేశం నేడు సురక్షింతగా ఉందంటే అది వాజ్ పేయ్ ముందు చూపే కారణం
మధుర లో తన ఓటమిని కూడా పాజిటీవ్ గా తీసుకున్నారు.
రాజా ప్రతాప్ సింగ్ చేతిలో ఓడినందుకు గర్విస్తున్నా అని చెప్పారు
నిన్న వికసిత్ భారత్ గ్రామీణ రోజ్ గార్ పధకాన్ని మోడీ పార్లమెంట్ లో తీసుకువచ్చి, 125రోజుల పని దినాలు కల్పిస్తున్నారు
అనేక అభివృద్ది పనులకు గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని అనుసంధానం చేస్తున్నారు
వాజ్ పేయ్ ఆనాడు ప్రారంభించిన ఈ పధకాన్ని మరింత ముందుకు మోడీ తీసుకు వెళ్లారు
వాజ్ పేయ్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పధకాలను మోడీ అమలు చేస్తున్నరాు
వాజ్ పేయ్ జయంతిని గుడ్ గవర్నెన్స్ గా ప్రకటించి కార్యక్రమాలు చేస్తున్నారు
70 యేళ్లా సామాజిక జీవితంలో 60 యేళ్లు పార్లమెంటెన్ గా ఆయన జీవితం ఆదర్శం
ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా సుపరిపాలన యాత్ర చేపట్టాం
డిసెంబర్ 25న జయంతి సందర్భంగా అమరావతి వాజ్ పేయ్ స్మృతి వనాన్ని ప్రారంభిస్తున్నాం
సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు
దేశంలో పొలిటికల్ కనెక్టివిటీ ఏర్పాటుచేసిన నేత వాజ్ పేయ్
మోడీ సారధ్యంలో కూడా యన్డీఎ పక్షాల సారధ్యంలో దేశం, రాష్ట్రం అబివృద్ది చెందుతుంది


