*అక్టోబర్ 4, 5 తేదీల్లో బ్రెజిల్ ప్రతినిధుల బృందం తూర్పు గోదావరి పర్యటన
తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చి పెడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు .
బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారత్దేశం లో జరుగుతున్న G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంతో ఈ పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు.
బ్రెజిల్ నుండి వచ్చిన ఈ బృందానికి Mrs. వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహించగా, Mr. సాండ్రో స్కూజా డ సిల్వా (UNICAFES), Mrs. జాయిస్ అపరెసిడా లోప్స్ (UNICRAB) ముఖ్య ప్రతినిధులుగా వ్యవసాయ విధానాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పర్యటనలో 27 మంది సభ్యులు పాల్గొననున్నట్లు తెలియ చేశారు.
*మొదటి బృందం పర్యటన వివరాలు:*
అక్టోబర్ 4: పెరవలి మండలం, ముక్కామల గ్రామం
అక్టోబర్ 5: కొవ్వూరు మండలం కాపవరం, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామాలు
→ ఈ బృందానికి సమన్వయ అధికారులు జకీర్ మరియు మధు మోహన్, వీరితో పాటు ఇతర సాంకేతిక, కమ్యూనికేషన్ విభాగాల సిబ్బంది ఉంటారు.
*రెండవ బృందం పర్యటన వివరాలు:*
అక్టోబర్ 4: కొవ్వూరు మండలం కాపవరం
అక్టోబర్ 5: దేవరపల్లి మండలం కూరుకురు, పల్లంట్ల, యర్నగూడెం గ్రామాలు
→ ఈ బృందానికి సమన్వయ అధికారులు సుధాకర్ మరియు హుమాయూన్, అనుబంధ సాంకేతిక బృందం, కమ్యూనికేషన్ విభాగం అధికారులు కూడా తోడ్పడతారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్ని విభాగాధికారులు పరస్పర సమన్వయం చేసుకుని ఈ పర్యటన విజయవంతం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా బృందాలు 4, 6 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించనున్నట్లు తెలిపారు.


