Wednesday, 25 March 2026
  • Home  
  • అక్టోబర్ 22నుంచి మండల కాల మహా అన్న ప్రసాద వితరణ
- విశాఖపట్నం

అక్టోబర్ 22నుంచి మండల కాల మహా అన్న ప్రసాద వితరణ

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు. వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. భక్తి భావంతో వస్తురూపణ గాని బియ్యం పప్పుదినుసులు, కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి, రసీదు పొందవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కే. కోటేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, గురుస్వామి కడగల శ్రీను, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కే సుబ్రహ్మణ్యం, కే శ్రీనివాస్, కే. లక్ష్మీనారాయణ,ట్రస్టు సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి, పి.అవతార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు. వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. భక్తి భావంతో వస్తురూపణ గాని బియ్యం పప్పుదినుసులు, కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి, రసీదు పొందవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కే. కోటేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, గురుస్వామి కడగల శ్రీను,
ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కే సుబ్రహ్మణ్యం, కే శ్రీనివాస్, కే. లక్ష్మీనారాయణ,ట్రస్టు సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి, పి.అవతార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.