పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు తీరును నిరసిస్తూ పలమనేరు టీడీపీ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి సుమారు 100 పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆ అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు దీన్ని కండిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందుశెట్టి, బాలాజీ రాయల్,పాలబాబు, బ్రహ్మయ్య , సుబ్రమణ్యం గౌడు, క్రిష్ణమూర్తి,ఆర్బీసి కుట్టి, ఎస్సీ సెల్ నాగరాజు, గిరిబాబు, చిన్ని,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు తీరును నిరసిస్తూ పలమనేరు టీడీపీ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి సుమారు 100 పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆ అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు దీన్ని కండిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందుశెట్టి, బాలాజీ రాయల్,పాలబాబు, బ్రహ్మయ్య , సుబ్రమణ్యం గౌడు, క్రిష్ణమూర్తి,ఆర్బీసి కుట్టి, ఎస్సీ సెల్ నాగరాజు, గిరిబాబు, చిన్ని,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.