శ్రీకాళహస్తి: చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత సిగ్గుచేటని,ఇది ఒక అమానవీయ చర్యగా సిపిఐ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం అణిచివేతకు గురైన వర్గాల నాయకుడు మాత్రమే కాదు భారత రాజ్యాంగ నిర్మాత అని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని దహనం చేసి అపవిత్ర చేయడం అంటే భారత గణతంత్ర ఆత్మపై దాడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఈ దుస్సాహసానికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంబేద్కర్ విగ్రహన్నీ దహనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి-జనమాల గురవయ్య
శ్రీకాళహస్తి: చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత సిగ్గుచేటని,ఇది ఒక అమానవీయ చర్యగా సిపిఐ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం అణిచివేతకు గురైన వర్గాల నాయకుడు మాత్రమే కాదు భారత రాజ్యాంగ నిర్మాత అని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని దహనం చేసి అపవిత్ర చేయడం అంటే భారత గణతంత్ర ఆత్మపై దాడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఈ దుస్సాహసానికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

