మొంథా తుఫాను వల్ల పట్టణంలోని ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తో మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలుషితమైన నీరు,కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు డయేరియా,టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. వేడి చేసిన నీరు తాగాలని,బయట తినుబండారాలు తిన కూడదని తెలియజేసారు. ఇళ్ల చుట్ట పక్కల నీరు నిల్వ ఉండకూడదని అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడతారని తెలియజేశారు.పది నుంచి 15 రోజుల లోపల డెలివరీ అయ్యే గర్భవతులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని తెలియజేశారు.

అంటువ్యాధులపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి.. డాక్టర్ బాలు.
మొంథా తుఫాను వల్ల పట్టణంలోని ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తో మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలుషితమైన నీరు,కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు డయేరియా,టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. వేడి చేసిన నీరు తాగాలని,బయట తినుబండారాలు తిన కూడదని తెలియజేసారు. ఇళ్ల చుట్ట పక్కల నీరు నిల్వ ఉండకూడదని అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడతారని తెలియజేశారు.పది నుంచి 15 రోజుల లోపల డెలివరీ అయ్యే గర్భవతులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని తెలియజేశారు.

