Sunday, 7 December 2025
  • Home  
  • అంగన్వాడీ చిన్నారులకు బేబీ కుర్చీలు బహూకరించిన మానవతా…
- పశ్చిమ గోదావరి

అంగన్వాడీ చిన్నారులకు బేబీ కుర్చీలు బహూకరించిన మానవతా…

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): పెంటపాడు మండలం కూనాగారపేట లోని అంగన్వాడీ పిల్లలపై మానవతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ ధాత్రుత్వం చాటుకుంది.సోమవారం పెంటపాడు గ్రామం కూనాగర పేటలో గల అంగన్వాడి పాఠశాలలోని బాల బాలికల సౌకర్యార్థం10 కుర్చీలను మానవతా అందజేయడం జరిగినది.వాటితో పాటు విద్యార్థులకు రాత పలకలు, స్వీట్లు,పెన్సిళ్లు, బిస్కెట్లు, ఫ్రూటీ ప్యాకెట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్,పూర్వపు ఆంధ్రా బ్యాంక్ సీనియర్ మేనేజర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ మానవత సంస్థ రాష్ట్రవ్యాప్తంగా165 మండలాలలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై కష్టకాలంలో ఉన్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న సేవా సంస్థ మానవత అని అన్నారు. “ఉత్తమ సమాజ నిర్మాణమే” మానవతాధ్యేయంగా ముందుకు సాగుతున్న మానవత, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడం, రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో, పాఠశాలలలో విద్యార్థులకు నైతిక విలువల బోధన, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థికంగా ఆదుకోవటం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ అని, బ్రతికి ఉన్న మనుషులకే కాక చనిపోయినప్పుడు కూడా వారి పార్థివ దేహాలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మానవతా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యవర్గ సభ్యులు తారాడి పాల్,విప్పర్తి వినాయకుడు,మీసాల సత్యనారాయణ,ఆర్.వి.టి. రాజ్ కుమార్,నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక పెద్దలు టి.సంజయ ఖాన్,తానేటి కుమార్ రాజా,లింగాల బెన్నీ,అంగన్వాడి టీచర్ లింగాల గౌరి,తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): పెంటపాడు మండలం కూనాగారపేట లోని అంగన్వాడీ పిల్లలపై మానవతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ ధాత్రుత్వం చాటుకుంది.సోమవారం పెంటపాడు గ్రామం కూనాగర పేటలో గల అంగన్వాడి పాఠశాలలోని బాల బాలికల సౌకర్యార్థం10 కుర్చీలను మానవతా అందజేయడం జరిగినది.వాటితో పాటు విద్యార్థులకు రాత పలకలు, స్వీట్లు,పెన్సిళ్లు, బిస్కెట్లు, ఫ్రూటీ ప్యాకెట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్,పూర్వపు ఆంధ్రా బ్యాంక్ సీనియర్ మేనేజర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ మానవత సంస్థ రాష్ట్రవ్యాప్తంగా165 మండలాలలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై కష్టకాలంలో ఉన్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న సేవా సంస్థ మానవత అని అన్నారు. “ఉత్తమ సమాజ నిర్మాణమే” మానవతాధ్యేయంగా ముందుకు సాగుతున్న మానవత, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడం, రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో, పాఠశాలలలో విద్యార్థులకు నైతిక విలువల బోధన, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థికంగా ఆదుకోవటం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ అని, బ్రతికి ఉన్న మనుషులకే కాక చనిపోయినప్పుడు కూడా వారి పార్థివ దేహాలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మానవతా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యవర్గ సభ్యులు తారాడి పాల్,విప్పర్తి వినాయకుడు,మీసాల సత్యనారాయణ,ఆర్.వి.టి. రాజ్ కుమార్,నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక పెద్దలు టి.సంజయ ఖాన్,తానేటి కుమార్ రాజా,లింగాల బెన్నీ,అంగన్వాడి టీచర్ లింగాల గౌరి,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.