ఒంగోలులో సురభి అష్టావధానం💐💐💐
షిరిడిసాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో,
జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత సురభిశంకరశర్మ అష్టావధానంను నిర్వహిస్తున్నట్లు
అధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ తెలియచేశారు.ఈకార్యక్రమం
ఒంగోలు లాయర్ పేట షిరిడీ సాయిమందిరంలోఏప్రియల్ 5వతేది ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమౌతుందని ,
ఏ.పి.జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ డా.బి.శ్రీకృష్ణవేణి,ముఖ్య అతిథిగాపాల్గొంటారని తెలిపారు.
అష్టావధాని మానేపల్లి నాగకుమార్ సభాసంచాలకులు గావ్యవహరిస్తారని చెప్పారు.
నిషిద్ధాక్షరికి- అష్టావధానిదూపాటి రామాచార్యులు,న్య
స్తాక్షరికి- అష్టావధాని డా.జిల్లెళ్ళవరప్రసాద్,
దత్తపదికి-డా.రామచంచంద్రుని రమేష్,
సమస్యకు-గుడ్లూరి వేంకటేశ్వరరాయకవి,
వర్ణనకు- తెలుగు ఉపన్యాసకులు యడ్లపల్లి శ్రీరామమూర్తి,ఆశువు
కు-తెలుగు అధ్యాపకులు యం.వి.యస్. శాస్త్రి,
మీమాట-నాపాటకు విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,అప్రస్తుతప్రసంగం-సంస్కృతోపన్యాసకులు దొప్పలపూడి వేంకటరావులు ప్రాశ్నికులుగా పాల్గొనబోతున్నారని డా.రావిపాటి తెలిపారు.


