Wednesday, 30 July 2025
  • Home  
  • స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
- Featured - ఆంధ్రప్రదేశ్

స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విశాఖపట్నం ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నేపథ్యంలో, విశాఖపట్నం జిల్లా డీఈఓ శ్రీ ప్రేమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ విద్యార్థులు భాగస్వాములై, సాయిరాం నగర్ పరిసరాల్లో విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా: • కాల్వల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం • నీటి పంపుల వద్ద పేరుకుపోయిన నాచు, వ్యర్ధాలను శుభ్రపరచడం • పూల మొక్కలను ట్రిమ్ చేయడం • పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం అంతేకాక, విద్యార్థులందరూ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన అనంతరం, స్థానిక ప్రజలకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డా. లక్ష్మణస్వామి పాలూరు గారు, విద్యార్థుల చొరవను అభినందిస్తూ, “పిల్లలు చిన్న వయస్సులోనే స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చి, సమాజానికి మార్గదర్శకులవుతారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ టీచర్ గరిమెళ్ల పద్మజా పూర్ణ, తూర్పాటి సూర్యకుమారి, సింగిరెడ్డి లక్ష్మి, సాలపు రూపులత, అచ్యుతని లక్ష్మి, వీర కుమార్ మాస్టారు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు విద్యార్థుల సేవా మానసికతను అభినందించారు.

స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
విశాఖపట్నం ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నేపథ్యంలో, విశాఖపట్నం జిల్లా డీఈఓ శ్రీ ప్రేమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ విద్యార్థులు భాగస్వాములై, సాయిరాం నగర్ పరిసరాల్లో విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా:
• కాల్వల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం
• నీటి పంపుల వద్ద పేరుకుపోయిన నాచు, వ్యర్ధాలను శుభ్రపరచడం
• పూల మొక్కలను ట్రిమ్ చేయడం
• పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం

అంతేకాక, విద్యార్థులందరూ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన అనంతరం, స్థానిక ప్రజలకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డా. లక్ష్మణస్వామి పాలూరు గారు, విద్యార్థుల చొరవను అభినందిస్తూ, “పిల్లలు చిన్న వయస్సులోనే స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చి, సమాజానికి మార్గదర్శకులవుతారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ టీచర్ గరిమెళ్ల పద్మజా పూర్ణ, తూర్పాటి సూర్యకుమారి, సింగిరెడ్డి లక్ష్మి, సాలపు రూపులత, అచ్యుతని లక్ష్మి, వీర కుమార్ మాస్టారు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు విద్యార్థుల సేవా మానసికతను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.