పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం నాడు “వినూత్న ఔషధ పంపిణీ కోసం లిపిడ్ ఆధారిత సూత్రీకరణలు” అనే అంశం పై ఒక రోజు జాతీయ సెమినార్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సెమినార్కు అమెరికా దేశంలోని ఆబర్న్ విశ్వవిద్యాలయంకు చెందిన హారిసన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ డా. జే బాబు రామాపురం గారు వక్తగా హాజరై ఉపన్యాసం అందించారు. లిపిడ్ ఆధారిత ఔషధ రూపకల్పనలో ఆధునిక పద్ధతులు, నూతన ఔషధ పంపిదీ సాంకేతికతలు, బయో అవైలబిలిటీ మెరుగుదల వంటి అంశాలపై అయిన సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఐ క్యుఏసిఆధ్వర్యంలో, ఐఐసీ మరియు ఆర్2డి సెల్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ మరియి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రసన్నరాజు, బోధన సిట్టింది.




