ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు, యువ నాయకులు మేకపాటి అభినవ్ రెడ్డి ఈరోజు సీతారాంపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న NH-544G టన్నెల్స్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ టన్నెల్స్ సౌత్ ఇండియాలోనే అత్యంత పొడవైన టన్నెల్స్గా రూపొందుతున్నాయి.
ఈ సందర్భంగా సీతారాంపురం మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్ రెడ్డి, యువ నాయకులు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వారు అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించి, అధికారుల నుండి పనుల పురోగతి గురించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాంత అభివృద్ధికి ఈ టన్నెల్స్ కీలకంగా మారనున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్య పాత్ర పోషించనుందని వారు పేర్కొన్నారు.



