శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, అలాగే పెండింగ్లో ఉన్న కీలక పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

సియం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి– నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ
శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, అలాగే పెండింగ్లో ఉన్న కీలక పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

