పలమనేరు జూలై 1,2020(పున్నమి విలేకరి): కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై 3వ తేదీన దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన జయప్రదం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు అందులో భాగంగా బుధవారం స్థానిక బాపూజీ ఉద్యానవనంలో గోడ పత్రికను విడుదల చేశారు. కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మరింత ముమ్మరం చేస్తున్నాయని, ఈ విధానాలను అడుగడుగున వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీపీఎం నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, సుధాకర్, లక్ష్మయ్య సిపిఐ నాయకులు చెన్నకేశవులు, సుబ్రమణ్యం, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు
సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘనను జయప్రదం చేయండి
పలమనేరు జూలై 1,2020(పున్నమి విలేకరి): కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై 3వ తేదీన దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన జయప్రదం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు అందులో భాగంగా బుధవారం స్థానిక బాపూజీ ఉద్యానవనంలో గోడ పత్రికను విడుదల చేశారు. కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మరింత ముమ్మరం చేస్తున్నాయని, ఈ విధానాలను అడుగడుగున వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీపీఎం నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, సుధాకర్, లక్ష్మయ్య సిపిఐ నాయకులు చెన్నకేశవులు, సుబ్రమణ్యం, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు