_విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి:_ జీవీఎంసీ, టూరిజం, విద్యా తదితర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసి భీమిలి ఉత్సవ్ ను ఘనంగా నిర్వహించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలి ఉత్సవ్ ను ప్రజలకు, టూరిస్టులకు అనుకూలమైన తేదీల్లో నిర్వహించాలని సూచించారు. భీమిలి చారిత్రక గొప్పదనాన్ని తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలన్నారు. కోలాటాలు.. బోట్ రేసింగ్.. పారా గ్లైడింగ్.. బీచ్ వాలీబాల్.. కబడ్డీ.. డ్రాయింగ్.. రంగోలి.. కుకింగ్.. తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పగా.. ఉత్సవ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీడీపీ హయంలో క్రమం తప్పకుండా ఎంతో ఉత్సాహంగా జరిపిన ఉత్సవ్ ను వైసీపీ హయంలో నిర్వహించకుండా ఆ స్ఫూర్తిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. సమావేశంలో టూరిజం రీజనల్ డైరక్టర్ కల్యాణి, జిల్లా టూరిజం అధికారి మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతోనే భీమిలి ఉత్సవ్ విజయవంతం*ఎమ్మెల్యే గంటా*
_విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి:_ జీవీఎంసీ, టూరిజం, విద్యా తదితర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసి భీమిలి ఉత్సవ్ ను ఘనంగా నిర్వహించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలి ఉత్సవ్ ను ప్రజలకు, టూరిస్టులకు అనుకూలమైన తేదీల్లో నిర్వహించాలని సూచించారు. భీమిలి చారిత్రక గొప్పదనాన్ని తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలన్నారు. కోలాటాలు.. బోట్ రేసింగ్.. పారా గ్లైడింగ్.. బీచ్ వాలీబాల్.. కబడ్డీ.. డ్రాయింగ్.. రంగోలి.. కుకింగ్.. తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పగా.. ఉత్సవ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీడీపీ హయంలో క్రమం తప్పకుండా ఎంతో ఉత్సాహంగా జరిపిన ఉత్సవ్ ను వైసీపీ హయంలో నిర్వహించకుండా ఆ స్ఫూర్తిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. సమావేశంలో టూరిజం రీజనల్ డైరక్టర్ కల్యాణి, జిల్లా టూరిజం అధికారి మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

