Saturday, 14 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం… 1,937 కేసుల పరిష్కారం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం… 1,937 కేసుల పరిష్కారం

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణం న్యాయస్థాన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే అవకాశంపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ద్వారా అప్పిలు లేని తుది తీర్పు పొందవచ్చని, రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ముందుగా కోర్ట్ ఆవరణలో తిరుపతి, సంకల్ప హాస్పిటల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ నిర్వహించగా న్యాయమూర్తులు ఈ వైద్య శిభిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,937 కేసులు పరిష్కరించబడగా, రూ.1,01,73,495 నగదు వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, మెజిస్ట్రేట్ సాంబశివ, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణం న్యాయస్థాన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే అవకాశంపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ద్వారా అప్పిలు లేని తుది తీర్పు పొందవచ్చని, రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ముందుగా కోర్ట్ ఆవరణలో తిరుపతి, సంకల్ప హాస్పిటల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ నిర్వహించగా న్యాయమూర్తులు ఈ వైద్య శిభిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,937 కేసులు పరిష్కరించబడగా, రూ.1,01,73,495 నగదు వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, మెజిస్ట్రేట్ సాంబశివ, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.