Wednesday, 11 March 2026
  • Home  
  • 132 సంవత్సరాల తరువాత తెలుగులోకి ‘శ్రీకాళహస్తి స్థల పురాణం’… జగద్గురువులచే ఆవిష్కరణ
- తిరుపతి

132 సంవత్సరాల తరువాత తెలుగులోకి ‘శ్రీకాళహస్తి స్థల పురాణం’… జగద్గురువులచే ఆవిష్కరణ

శ్రీకాళహస్తి (పున్నమి న్యూస్), మార్చి 11: దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ బుధవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జగద్గురువులు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య “శ్రీకాళహస్తి స్థల పురాణం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ గ్రంథం విశిష్టతను వివరించిన ప్రముఖులు మాట్లాడుతూ.. 1893 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానాధీశులైన శ్రీశ్రీశ్రీ వెలుగోటి రాజా ముద్దుకృష్ణ యాచేంద్ర భూపాల వారి ఆధ్వర్యంలో ప్రచురితమైన సంస్కృత గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చెట్లూరు వెంకటసుబ్రమణ్యం శాస్త్రి పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 132 సంవత్సరాల తరువాత ఈ మహాగ్రంథాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారని శివపురాణాంతర్గతంగా ఉన్న శివరహస్య సంగ్రహం ఆధారంగా రూపొందిన ఈ శ్రీకాళహస్తి స్థల పురాణంలో మొత్తం 90 అధ్యాయాలు, 9,430 శ్లోకాలు ఉన్నాయి. ఐదు సంపుటాలుగా విస్తరించిన ఈ గ్రంథం సుమారు 1,700 పేజీలతో వెలువడింది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు తెలుగులో వ్యాఖ్యాన సమేతంగా ఆంధ్రీకరించారు. ప్రఖ్యాత కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంతో పోలిస్తే ఇది విస్తృతమైన, భిన్నమైన మహాగ్రంథమని పండితులు తెలిపారు. ఈ గ్రంథం సంపాదకత్వాన్ని మాజీ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించిన కె.ఎస్. రామారావు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంతో అనుబంధం కలిగిన ఆయన సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా ఈ గ్రంథం వెలువడిందని ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గురజాల నాగారాజ జెట్టి ప్రత్యేక కృషి చేశారు. శృంగేరి జగద్గురువుల చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భక్తులు, పండితులు అభిప్రాయపడ్డారు.

శ్రీకాళహస్తి (పున్నమి న్యూస్), మార్చి 11: దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ బుధవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జగద్గురువులు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య “శ్రీకాళహస్తి స్థల పురాణం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ గ్రంథం విశిష్టతను వివరించిన ప్రముఖులు మాట్లాడుతూ.. 1893 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానాధీశులైన శ్రీశ్రీశ్రీ వెలుగోటి రాజా ముద్దుకృష్ణ యాచేంద్ర భూపాల వారి ఆధ్వర్యంలో ప్రచురితమైన సంస్కృత గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చెట్లూరు వెంకటసుబ్రమణ్యం శాస్త్రి పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 132 సంవత్సరాల తరువాత ఈ మహాగ్రంథాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారని శివపురాణాంతర్గతంగా ఉన్న శివరహస్య సంగ్రహం ఆధారంగా రూపొందిన ఈ శ్రీకాళహస్తి స్థల పురాణంలో మొత్తం 90 అధ్యాయాలు, 9,430 శ్లోకాలు ఉన్నాయి. ఐదు సంపుటాలుగా విస్తరించిన ఈ గ్రంథం సుమారు 1,700 పేజీలతో వెలువడింది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు తెలుగులో వ్యాఖ్యాన సమేతంగా ఆంధ్రీకరించారు. ప్రఖ్యాత కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంతో పోలిస్తే ఇది విస్తృతమైన, భిన్నమైన మహాగ్రంథమని పండితులు తెలిపారు. ఈ గ్రంథం సంపాదకత్వాన్ని మాజీ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించిన కె.ఎస్. రామారావు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంతో అనుబంధం కలిగిన ఆయన సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా ఈ గ్రంథం వెలువడిందని ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గురజాల నాగారాజ జెట్టి ప్రత్యేక కృషి చేశారు. శృంగేరి జగద్గురువుల చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భక్తులు, పండితులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.