తూర్పుగోదావరి జిల్లా
ప్రతినిధి పున్నమి న్యూస్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
అనపర్తి మండలం సోమేశ్వరంలొ బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కందర్ప కామేశ్వరరావుగారు (గ్రామ పురోహితులు) మరియు వేద పండితుల సమక్షంలో జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేవీప్యమానంగా సోమేశ్వరం ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా, ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు.
End


