ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
వెలుగుమట్లలో సర్వే నంబర్లు 147, 148, 149 లో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా ఇస్తామని చెప్పి, ఫోన్ ద్వారా రూ. 45,000/- తీసుకుని మోసం చేశారని ఆమె ఆరోపించారు.
మా సంస్థ ద్వారా భూమి కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం పట్టా ఇస్తుంది. జిల్లా కలెక్టర్ మీ పేరుతో ఒక ప్లాట్ ఇస్తారు. ప్రతి ప్లాట్ 100 గజాలు ఉంటుంది. ప్లాట్లు లేని వారికి ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఇవి ఇస్తోంది. అటువంటి ప్లాట్లను ఇవ్వడానికి ఏర్పాటైన కమిటీలో నేను కూడా సభ్యుడిని. మీకు కూడా అటువంటి ప్లాట్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలి” అని నమ్మబలికారు.
ఆ మాటలను నమ్మి నేను ఫోన్ ద్వారా రూ. 45,000/- చెల్లించాను అని కిష్టారం గ్రామం, సత్తుపల్లి మండలానికి చెందిన గుడిమల్ల స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు.


