Tuesday, 17 March 2026
  • Home  
  • విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపె కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు
- తిరుపతి

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపె కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్.వి.ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా సెట్విన్ సంస్థ సౌజన్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. నరసింహ వర్మ అధ్యక్షత వహిస్తూ, విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటేనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. అనంతరం సెట్విన్ తిరుపతి జిల్లా సీఈఓ మోహన్, కెరీర్ గైడెన్స్ మోటివేటర్ ఎన్.ఎస్. రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ..వ్యక్తిత్వ వికాసం, పాజిటివ్ థింకింగ్, లక్ష్య నిర్ధేశం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పింస్తూ.. విద్యార్థులకి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో లభించే వివిధ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా. రమేష్ బాబు సమన్వయం చేయగా, అధ్యాపకులు డా.వి. మునయ్య, రాజేంద్రుడు, డా. చంద్రమౌళి, డా. సతీష్, డా. సాయి వెంకటేష్, రామ సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్.వి.ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా సెట్విన్ సంస్థ సౌజన్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. నరసింహ వర్మ అధ్యక్షత వహిస్తూ, విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటేనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. అనంతరం సెట్విన్ తిరుపతి జిల్లా సీఈఓ మోహన్, కెరీర్ గైడెన్స్ మోటివేటర్ ఎన్.ఎస్. రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ..వ్యక్తిత్వ వికాసం, పాజిటివ్ థింకింగ్, లక్ష్య నిర్ధేశం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పింస్తూ.. విద్యార్థులకి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో లభించే వివిధ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా. రమేష్ బాబు సమన్వయం చేయగా, అధ్యాపకులు డా.వి. మునయ్య, రాజేంద్రుడు, డా. చంద్రమౌళి, డా. సతీష్, డా. సాయి వెంకటేష్, రామ సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.