*విద్యార్థి యువత కోసం రాజీ లేని పోరాట యోధుడు కామ్రేడ్ ఈశ్వరయ్య – శ్రీకాళహస్తి ఏఐటీయూసీ సన్మానం.*
*సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సన్మానం*
తిరుపతి, నవంబర్ 10
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ఎంపిక కావడం పార్టీకి గౌరవకరమైన అంశమని, ఆయన నాయకత్వం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని. కామ్రేడ్ ఈశ్వరయ్యను గజమాల,దుస్సాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు విద్యార్థి దశలోనే అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారన్నారు. ఎప్పుడూ రాజీ పడని స్వభావం, నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచే ధైర్యం, ప్రజల సమస్యల పట్ల ఉన్న నిబద్ధత ఆయనను ఇతరుల కంటే ప్రత్యేకుడిగా నిలబెట్టాయని అన్నారు. విద్యార్థి ఉద్యమాలు ఉద్ధృతంగా సాగుతుండగా, ఈశ్వరయ్య గారు ముందు వరుసలో నిలబడి విద్యార్థు హక్కుల కోసం పోరాడేవారన్నారు. స్పష్టమైన ఆలోచన, వాక్చాతుర్యం, క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వానికి ముద్రవేసిన లక్షణాలు అని తెలిపారు.పార్టీ సిద్ధాంతాలకు అచంచలంగా కట్టుబడి, సామాజిక న్యాయ సాధన కోసం జీవితాంతం .
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య తిరుపతి పట్టణ కార్యదర్శి జిల్లా విశ్వనాథ్ కత్తి రవి జనమాల గురవయ్య వైయస్ మణి మించల శివకుమార్ తొండు మల్లికార్జున్ కార్తీక్ జ్యోతి సాయి మహేష్ సెల్వ తదితరులు పాల్గొన్నారు.


