10 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు నోటీసులు
అసత్య కథనాల కట్టడికి పోలీసుశాఖ చర్యలు
*10 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు నోటీసులు*
*అసత్య కథనాల కట్టడికి పోలీసుశాఖ చర్యలు*
సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాల కట్ట డికి పోలీస్ శాఖ నడుం బిగించింది. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసు అధికారులను, సిబ్బంది ని సభ్యులుగా చేర్చుకుని కథనాలు పోస్టు చేస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో.. పోలీస్ శాఖ చర్యలకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించి పోస్ట్ చేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా అందుకు గ్రూపు అడ్మిన్లదే బాధ్యత అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసా రిగా 15 వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. ముందుగా 10 క్రైమ్ గ్రూపుల అడ్మిన్ లకు నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. వారు నివాసం ఉండే పరిధిలోని పోలీ స్ స్టేషన్ల నుంచి వారికి పిలుపు వచ్చింది. స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకోవాలని సూచించారు. నగరంలోని లాలాపేట స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు గ్రూప్లో అడ్మిన్లకు నోటీసులు సిద్ధం చేసి.. వాటిని తీసుకోవాలని ఫోన్లు చేసి చెప్పారు. అలాగే అరండల్ పేట, నగరంపాలెం, పెదకాకానితో పాటు పొన్నూరు టౌన్కు చెందిన అడ్మిన్లు ఉన్నారు. అలాగే మరో రెండు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల అడ్మిన్లు కూడా ఉన్నారు. వారికి కూ డా నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా కూడా మరికొన్ని గ్రూపులకు నోటీసులు ఇచ్చేం దుకు చర్యలు ప్రారంభించారు. అలాగే యూ ట్యూబ్ చానళ్ల పేరుతో.. పోలీసులను, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. కొందరు ఏకంగా జిల్లా పోలీస్ కార్యాలయానికే వచ్చి బాధితులను డబ్బు డిమాండ్ చేస్తున్న విషయం కూడా పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాల కట్ట డికి పోలీస్ శాఖ నడుం బిగించింది. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసు అధికారులను, సిబ్బంది ని సభ్యులుగా చేర్చుకుని కథనాలు పోస్టు చేస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో.. పోలీస్ శాఖ చర్యలకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించి పోస్ట్ చేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా అందుకు గ్రూపు అడ్మిన్లదే బాధ్యత అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసా రిగా 15 వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. ముందుగా 10 క్రైమ్ గ్రూపుల అడ్మిన్ లకు నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. వారు నివాసం ఉండే పరిధిలోని పోలీ స్ స్టేషన్ల నుంచి వారికి పిలుపు వచ్చింది. స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకోవాలని సూచించారు. నగరంలోని లాలాపేట స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు గ్రూప్లో అడ్మిన్లకు నోటీసులు సిద్ధం చేసి.. వాటిని తీసుకోవాలని ఫోన్లు చేసి చెప్పారు. అలాగే అరండల్ పేట, నగరంపాలెం, పెదకాకానితో పాటు పొన్నూరు టౌన్కు చెందిన అడ్మిన్లు ఉన్నారు. అలాగే మరో రెండు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల అడ్మిన్లు కూడా ఉన్నారు. వారికి కూ డా నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా కూడా మరికొన్ని గ్రూపులకు నోటీసులు ఇచ్చేం దుకు చర్యలు ప్రారంభించారు. అలాగే యూ ట్యూబ్ చానళ్ల పేరుతో.. పోలీసులను, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. కొందరు ఏకంగా జిల్లా పోలీస్ కార్యాలయానికే వచ్చి బాధితులను డబ్బు డిమాండ్ చేస్తున్న విషయం కూడా పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.

