శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18:శ్రీకాళహస్తి నివాసులైన గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ వరలక్ష్మి, కుమారి సాయి దీపికలకు వర్లి చిత్రకళ ద్వారా రామాయణాన్ని వినూత్న పద్ధతుల్లో చిత్రీకరించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కడంపై బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సంవేశంలో వారు మాట్లాదుతూ.. గిరిజన తెగలో అరుదుగా కనిపించే వర్లి ఆర్ట్ ద్వారా అతి సులువుగా విద్యా బోధన చేయొచ్చని 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లోని సంపూర్ణ రామాయణాన్ని మొత్తం 20 నిమిషాల్లో రివిజన్ చేసే విధంగా వర్లీ చిత్రకళ దోహదపడుతుందన్నారు. అతి సులువైన త్రిభుజాలు వృత్తాలు, గీతలు ద్వారా పురాణ ఇతిహాసాలను పరిచయం చేస్తూ విలువలతో కూడిన విద్యను వినూత్న రీతిలో విద్యార్థులకు అందించే విధంగా తాము త్వరలో వంద పాఠశాలలో కార్యాచరణ చేపట్టనున్నామని ఈ వర్లి చిత్రలేఖనం ద్వారా 20 నిమిషాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో ఆసక్తితో పాటు రామాయణంలోని నీతిని, విలువలును తెలుసుకునే విధంగా అవగాహనా సదస్సులు నిర్వహించనున్నామని తొట్ట తొలిగా తాము తీసుకొచ్చిన పరిశోధనాత్మక వర్లీ ఆర్ట్ ను నూతన జాతీయ విద్యా విధానంలో సైతం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నయని వృత్తి నైపుణ్య విద్యగా కూడా వర్లి ఆర్ట్ దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

వర్లి ఆర్ట్ తో విద్యా బోధన సులభతరం -తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18:శ్రీకాళహస్తి నివాసులైన గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ వరలక్ష్మి, కుమారి సాయి దీపికలకు వర్లి చిత్రకళ ద్వారా రామాయణాన్ని వినూత్న పద్ధతుల్లో చిత్రీకరించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కడంపై బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సంవేశంలో వారు మాట్లాదుతూ.. గిరిజన తెగలో అరుదుగా కనిపించే వర్లి ఆర్ట్ ద్వారా అతి సులువుగా విద్యా బోధన చేయొచ్చని 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లోని సంపూర్ణ రామాయణాన్ని మొత్తం 20 నిమిషాల్లో రివిజన్ చేసే విధంగా వర్లీ చిత్రకళ దోహదపడుతుందన్నారు. అతి సులువైన త్రిభుజాలు వృత్తాలు, గీతలు ద్వారా పురాణ ఇతిహాసాలను పరిచయం చేస్తూ విలువలతో కూడిన విద్యను వినూత్న రీతిలో విద్యార్థులకు అందించే విధంగా తాము త్వరలో వంద పాఠశాలలో కార్యాచరణ చేపట్టనున్నామని ఈ వర్లి చిత్రలేఖనం ద్వారా 20 నిమిషాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో ఆసక్తితో పాటు రామాయణంలోని నీతిని, విలువలును తెలుసుకునే విధంగా అవగాహనా సదస్సులు నిర్వహించనున్నామని తొట్ట తొలిగా తాము తీసుకొచ్చిన పరిశోధనాత్మక వర్లీ ఆర్ట్ ను నూతన జాతీయ విద్యా విధానంలో సైతం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నయని వృత్తి నైపుణ్య విద్యగా కూడా వర్లి ఆర్ట్ దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

